డౌనింగ్ స్ట్రీట్లో దీపాలు వెలిగించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి
- November 13, 2020
లండన్: బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దీపావళి పండుగ సందర్భంగా డౌనింగ్ స్ట్రీట్లోని తన అధికారిక నివాసం ముందు దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన 50 సెకన్ల నిడివి గల వీడియోను ఇండియన్స్ ఇన్ లండన్ గ్రూపు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ చరిత్రలో తొలిసారి డౌనింగ్ స్ట్రీట్లో దివాలీ దీపం వెలిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం, హ్యాపీ దీపావళి అంటూ రాసుకోచ్చింది. ఇక డౌనింగ్ స్ట్రీట్ అనేది యూకే ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి అధికారిక నివాసాలను కలిగి ఉంటుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్లో రెండో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!