ఉన్నత విద్యావంతులకు, వృత్తి నిపుణులకు పదేళ్ల రెసిడెన్సీ వీసాలు-యూఏఈ
- November 16, 2020
యూఏఈ:లేబర్ మార్కెట్ లో స్వదేశీయులకు ప్రధాన్యత ఇస్తున్న యూఏఈ...టెక్నాలజీ పరంగా మాత్రం ప్రతిభావంతులైన విదేశీయులకు స్వాగతం పలుకుతోంది. వృత్తి నిపుణులకు ప్రధాన్యత ఇస్తూ పదేళ్ల గోల్డెన్ రెసిడెన్సీ వీసాలను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఉన్నత విద్యావంతులకు కూడా పదేళ్ల రెసిడెన్సీ వీసాలను ఇచ్చేందుకు యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ అనుమతి ఇచ్చారు. డాక్టర్లు, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు గోల్డెన్ రెసిడెన్సీ వీసాలు ఇవ్వనున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ రంగంలో నిపుణులను కూడా యూఏఈ స్వాగతిస్తోంది. ఏఐలో డిగ్రీ చేసిన వారికి పదేళ్ల రెసిడెన్సీ వీసా ఇస్తామని తెలిపింది. ఇక పీహెచ్డీ చేసిన యువత, అధికారిక అనుమతి ఉన్న ఏదైనా యూనివర్సిటీలో 3.8 కు మించి స్కోరింగ్ చేసిన విద్యార్ధులకు కూడా గోల్డెన్ రెసిడెన్సీ పొందవచ్చు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







