బైడెన్ మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయులు
- November 19, 2020
వాషింగ్టన్: భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న జోబైడెన్.. తన మంత్రివర్గంలోనూ ఇండో-అమెరికన్లకు చోటు కల్పించాలని భావిస్తున్నారట.. బైడెన్ కమలా హారిస్ గెలుపులో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించడంతో వారిని మెప్పించడానికి ఇద్దరు ఇండో అమెరికన్లను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారట.. బైడెన్ తన కేబినెట్ కోసం పరిశీలిస్తున్న ఇద్దరు ఇండో అమెరికన్లలో వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. వివేక్ మూర్తి జోబైడెన్ కు సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికాలో పేరున్న వైద్యుడు. దేశంలోనే ప్రముఖ జనరల్ సర్జన్. ఆయన్ని కేబినెట్ లోకి తీసుకొని ఆరోగ్యశాఖ అప్పగిస్తారని సమాచారం. మరో భారతీయుడు అరణ్ కు ఇంధనశాఖ కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోందని అక్కడి మీడియా తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









