బైడెన్ మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయులు

- November 19, 2020 , by Maagulf
బైడెన్ మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయులు

వాషింగ్టన్: భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న జోబైడెన్.. తన మంత్రివర్గంలోనూ ఇండో-అమెరికన్లకు చోటు కల్పించాలని భావిస్తున్నారట.. బైడెన్ కమలా హారిస్ గెలుపులో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించడంతో వారిని మెప్పించడానికి ఇద్దరు ఇండో అమెరికన్లను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారట.. బైడెన్ తన కేబినెట్ కోసం పరిశీలిస్తున్న ఇద్దరు ఇండో అమెరికన్లలో వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. వివేక్ మూర్తి జోబైడెన్ కు సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికాలో పేరున్న వైద్యుడు. దేశంలోనే ప్రముఖ జనరల్ సర్జన్. ఆయన్ని కేబినెట్ లోకి తీసుకొని ఆరోగ్యశాఖ అప్పగిస్తారని సమాచారం. మరో భారతీయుడు అరణ్ కు ఇంధనశాఖ కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోందని అక్కడి మీడియా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com