బహ్రెయిన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి
- November 25, 2020
మనామా:ఆరు రోజుల విదేశీ పర్యటలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. మంత్రితో పాటు బహ్రెయిన్ చేరుకున్న పలువురు ఉన్నతాధికారులకు ఆ దేశ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ దివంగత ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ బిన్ ఖలీఫా మృతికి భారత ప్రభుత్వం, ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలుపనున్నారు. అలాగే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించి చర్చించనున్నారు. బహ్రెయిన్ పర్యటన తర్వాత భారత విదేశాంగమంత్రి యూఏఈ చేరుకుంటారు. 26న యూఏఈ పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత27 నుంచి 28 వరకు సీషెల్స్ లో భారత విదేశాంగమంత్రి పర్యటిస్తారు.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







