బహ్రెయిన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి

- November 25, 2020 , by Maagulf
బహ్రెయిన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి

మనామా:ఆరు రోజుల విదేశీ పర్యటలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. మంత్రితో పాటు బహ్రెయిన్ చేరుకున్న పలువురు ఉన్నతాధికారులకు ఆ దేశ విదేశాంగ శాఖ, అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. బహ్రెయిన్ దివంగత ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ బిన్ ఖలీఫా మృతికి భారత ప్రభుత్వం, ప్రజల తరపున  ప్రగాఢ సానుభూతి తెలుపనున్నారు. అలాగే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు, ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించి చర్చించనున్నారు.  బహ్రెయిన్ పర్యటన తర్వాత భారత విదేశాంగమంత్రి యూఏఈ చేరుకుంటారు. 26న యూఏఈ పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత27 నుంచి 28 వరకు సీషెల్స్ లో భారత విదేశాంగమంత్రి  పర్యటిస్తారు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com