అమరవీరులకు నివాళులు అర్పించిన యూఏఈ
- November 30, 2020
యూఏఈ: జాతిని రక్షించేందుకు ప్రాణాలు ఒడ్డిన అమరవీరుల జ్ఞాపక దినోత్సవంగా నవంబర్ 30 ను ప్రతి ఏటా అమరవీరుల స్మారకదినోత్సవంగా జరుపుకుంటోంది యూఏఈ.
అమరవీరుల కుటుంబాల వ్యవహారాల కార్యాలయం, యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసీయులను ఉద్దేశించి ఉదయం 11.31 గంటల వరకు ఒక నిమిషం నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతూ పంపిన ఎస్ఎంఎస్ ను అనుసరించి నేడు సరిగ్గా ఉదయం 11.30 గంటలకు యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసులు ఒక నిమిషం మౌనం పాటిస్తూ సైనికులకు నివాళులర్పించారు.
నివాసితులు వారి ప్రశంస సందేశాలను #Proud_of_your_sacrifices ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని యూఏఈ కోరింది. దీంతో ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్ గా మారింది.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వీరులకు నివాళులు అర్పించారు. యూఏఈ లోని ఉన్నతాధికారులు సైతం తమ నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







