అమరవీరులకు నివాళులు అర్పించిన యూఏఈ
- November 30, 2020యూఏఈ: జాతిని రక్షించేందుకు ప్రాణాలు ఒడ్డిన అమరవీరుల జ్ఞాపక దినోత్సవంగా నవంబర్ 30 ను ప్రతి ఏటా అమరవీరుల స్మారకదినోత్సవంగా జరుపుకుంటోంది యూఏఈ.
అమరవీరుల కుటుంబాల వ్యవహారాల కార్యాలయం, యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసీయులను ఉద్దేశించి ఉదయం 11.31 గంటల వరకు ఒక నిమిషం నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతూ పంపిన ఎస్ఎంఎస్ ను అనుసరించి నేడు సరిగ్గా ఉదయం 11.30 గంటలకు యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసులు ఒక నిమిషం మౌనం పాటిస్తూ సైనికులకు నివాళులర్పించారు.
నివాసితులు వారి ప్రశంస సందేశాలను #Proud_of_your_sacrifices ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని యూఏఈ కోరింది. దీంతో ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్ గా మారింది.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వీరులకు నివాళులు అర్పించారు. యూఏఈ లోని ఉన్నతాధికారులు సైతం తమ నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్