బహ్రెయిన్: పిసిఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- December 01, 2020
మనామా:నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం పీసీఆర్ టెస్టుల ధర 60 బహ్రెయినీ దినార్స్ నుంచి 40 బహ్రెయినీ దినార్స్కి దిగి వచ్చింది. ఈ 40 బహ్రెయినీ దినార్స్లో పీసీఆర్ అరైవల్ టెస్ట్ అలాగే, వచ్చిన తర్వాత 10 రోజులకు చేసే టెస్ట్ కూడా కలిసి వుంటుంది. 'వివేర్ బహ్రెయిన్' అప్లికేషన్ని అరైవల్స్ అందరూ ఉపయోగించాల్సి వుంటుంది. టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. సంబంధిత డిక్లరేషన్పై సంతకం చేయాల్సి వుంటుంది. దేశంలోకి వచ్చిన తర్వాత పది రోజులకు చేసే పరీక్షలో పాజిటివ్ వస్తే, ఆయా వ్యక్తులతో హెల్త్ మినిస్ట్రీ ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. డిసెంబర్ 1 నుంచి తగ్గించిన పీసీఆర్ టెస్ట్ ధరలు అమల్లోకి వచ్చాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







