బహ్రెయిన్: పిసిఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- December 01, 2020
మనామా:నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ (కోవిడ్ 19) వెల్లడించిన వివరాల ప్రకారం పీసీఆర్ టెస్టుల ధర 60 బహ్రెయినీ దినార్స్ నుంచి 40 బహ్రెయినీ దినార్స్కి దిగి వచ్చింది. ఈ 40 బహ్రెయినీ దినార్స్లో పీసీఆర్ అరైవల్ టెస్ట్ అలాగే, వచ్చిన తర్వాత 10 రోజులకు చేసే టెస్ట్ కూడా కలిసి వుంటుంది. 'వివేర్ బహ్రెయిన్' అప్లికేషన్ని అరైవల్స్ అందరూ ఉపయోగించాల్సి వుంటుంది. టెస్టుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. సంబంధిత డిక్లరేషన్పై సంతకం చేయాల్సి వుంటుంది. దేశంలోకి వచ్చిన తర్వాత పది రోజులకు చేసే పరీక్షలో పాజిటివ్ వస్తే, ఆయా వ్యక్తులతో హెల్త్ మినిస్ట్రీ ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతుంది. డిసెంబర్ 1 నుంచి తగ్గించిన పీసీఆర్ టెస్ట్ ధరలు అమల్లోకి వచ్చాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







