ఆమ్నెస్టీని ఉపయోగించుకుంది 400 మంది ఇల్లీగల్ రెసిడెంట్స్ మాత్రమే
- December 09, 2020
కువైట్ సిటీ:ఇప్పటిదాకాకేవలం 400 మంది ఇల్లీగల్ రెసిడెంట్స్ మాత్రమే ఆమ్నెస్టీని వినియోగించుకున్నారు. తమ రెసిడెన్సీ స్టేటస్ని సరి చేసుకోవడానికి కువైట్ నాయకత్వం ఇచ్చిన ఆమ్నెస్టీని ఇంకా పెద్ద సంఖ్యలో ఇల్లీగల్ రెసిడెంట్స్ వినియోగించుకోవాల్సి వుంది. 130,000 మందికి పైగా ఉల్లంఘనులు దేశంలో వున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఈ ఆమ్నెస్టీ అందుబాటులో వుంటుంది. అయితే, తొలి వారంలో కేవలం 400 మంది మాత్రమే ఆమ్నెస్టీని వినియోగించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా ఇల్లీగల్ రెసిడెంట్స్ తమ రెసిడెన్సీని సరిచేసుకోవాల్సి వుంటుందనీ, ఆమ్నెస్టీ గడువు ముగించాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









