భారత్‌లో కొత్తగా 30,005 కరోనా కేసులు

- December 12, 2020 , by Maagulf
భారత్‌లో కొత్తగా 30,005 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌ కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 30,005 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,26,775కు చేరింది. ఇక గత 24 గంటల్లో 33,494 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 442 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,42,628కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 93,24,328 మంది కోలుకున్నారు. 3,59,819 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,26,97,399 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,65,176 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com