ఒమన్ లో తగ్గుతున్న కోవిడ్ ఎఫెక్ట్...మాస్క్ ల పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం
- December 13, 2020
మస్కట్:ఒమన్ ప్రజల్లో కోవిడ్ పట్ల స్పష్టమైన చైతన్యం కనిపిస్తోందని...అయితే ఫేస్ మాస్కుల విషయంలో మాత్రం కొందరు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒమన్ లో నిబంధనల ఉల్లంఘన కేసులు తగ్గుతుండటం సంతోషకరమైన విషయమే అయినా..నమోదైవుతున్నా కొద్ది కేసుల్లో ఎక్కువ శాతం ఫేస్ మాస్క్ ఉల్లంఘనులే ఉన్నారని వివరించారు. తాము విధించిన జరిమానాల్లో పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారే ఎక్కువ శాతం ఉన్నారని అన్నారు. ఆ తర్వాత కొన్ని తిరిగి ప్రారంభమైన కొన్ని సంస్థలకు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే..ఒమన్ వ్యాప్తంగా కొద్ది కాలంగా కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని వ్యాధి నియంత్రణ అధికార విభాగం తెలిపింది. కొన్ని నెలలుగా నమోదవుతున్న కొత్త కేసులను విశ్లేషించుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య 26 శాతం నుంచి 4 శాతానికి పడిపోయిందని స్పష్టత ఇచ్చింది. అయితే..దేశీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్ ఇన్ఫెక్ట్ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, అందుకే తాము ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించింది. కోవిడ్ ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం కనుక...వ్యాపార రంగంలో సంక్షోభం ఇంతటితో ముగిసిపోతుందని కూడా తాము భావించటం లేదని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







