బ్రిటన్లో విజృంభిస్తోన్న కొత్త రకం వైరస్,తెలంగాణలో ఇద్దరికి లక్షణాలు
- December 23, 2020
హైదరాబాద్:స్ట్రెయిన్గా రూపాంతరం చెందిన కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్లో కొత్త రకం వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజు వారిగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య 64.7 శాతానికి చేరింది. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకల విషయంలో ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఆ దేశంతో ఉన్న సరిహద్దులను ఫ్రాన్స్ మూసివేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ అత్యవసరంగా సమావేశం అవుతున్న WHO..కొత్త రకం వైరస్పై చర్చించనుంది. దాన్ని తట్టుకోవడం ఎలా? దాని నుంచి ప్రపంచ దేశాలకు ఉన్న ముప్పేంటి? ఏ విధంగా అప్రమత్తం చేయాలని దానిపై సభ్యులు చర్చించనున్నారు.
కొత్త వైరస్ నేపథ్యంలో అలజడి మొదలైంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. జన్యుమార్పిడి చెందిన వైరస్ కావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణకు వచ్చిన ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కొత్త వైరస్ నిర్ధారణ కోసం నమూనాలను పుణె పంపారు అధికారులు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి 1500 మంది వచ్చినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయనుంది ప్రభుత్వం. స్ట్రెయిన్ మహమ్మారి కొత్తగా జడలు విప్పుతోన్న వేళ, కేరళలో కొత్తగా 6.049మందికి కరోనా సోకగా, రాష్ట్రంలో 27 మరణాలు సంభవించాయి. దీంతో కేరళ సర్కారు అప్రమత్తమైంది. తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







