పట్టాలెక్కిన తొలి డ్రైవర్‌ రహిత రైలు

- December 28, 2020 , by Maagulf
పట్టాలెక్కిన తొలి డ్రైవర్‌ రహిత రైలు

న్యూఢిల్లీ: దేశంలో తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు నేడు పట్టాలెక్కింది. ఈ రైల్వే సర్వీసును సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఈ ఘనత దక్కింది. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్‌-బొటానికల్‌ గార్డెన్‌లో మొత్తం 37 కిలోమీటర్ల మేర ఈ రైలు నడువనుంది. 2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డ్రైవర్‌ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇదే మొదటి రైలు కావడం విశేషం.

అదేవిధంగా నేషనల్‌ మొబిలిటీ కార్డును (ఎన్‌సీఎంసీ) కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో మొదటిసారిగా ఎన్‌సీఎంసీ సేవలు వినియోగంలోకి రానున్నాయి. వన్‌ నేషన్‌ వన్‌ కార్డు నినాదంలో భాగంగా ఎన్‌సీఎంసీ సేవలను మోదీ ప్రారంభిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com