కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన: 10,000 బ్రహెయినీ దినార్ల జరీమానా
- December 30, 2020
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), పర్యాటక కేంద్రాల్లో (హోటళ్ళు అలాగే రెస్టారెంట్లలో కూడా) కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ముందస్తు జాగ్రత్త చర్యలు, అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సూచనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మినిస్టీరియల్ ఆర్డర్ నెంబర్ 68 - 2020 ప్రకారం రెస్టారెట్లు, కేఫ్ లు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు తప్పక పాటించాల్సి వుంటుంది. లేని పక్షంలో భారీ జరీమానాలు విధించే అవకాశం వుంది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 దిర్హాముల జరీమానా విధించే అవకాశం వుంటుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరించడం జరిగింది. టేబుల్ సీటింగ్ విషయానికొస్తే, 50 శాతం మాత్రమే ఓ టేబుల్ మీద కేవలం ఆరుగురికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఇక్కడా 50 శాతం సామర్థ్యం నిబంధన పాటించక తప్పదు. అత్యధికంగా ఆరుగుర్ని మాత్రమే ఓ టేబుల్ వద్ద అనుమతించాల్సి వుంటుంది. ఇండోర్ ఫెసిలిటీస్ విషయానికస్తే, 30 శాతం మంది మాత్రమే అత్యధికంగా వుండాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









