బహ్రెయిన్ ఆంక్షల కొనసాగింపు..మరో 2 నెలల పాటు ప్రవాసీయుల మినహాయింపు వర్తింపు

- January 02, 2021 , by Maagulf
బహ్రెయిన్ ఆంక్షల కొనసాగింపు..మరో 2 నెలల పాటు ప్రవాసీయుల మినహాయింపు వర్తింపు

బహ్రెయిన్: కోవిడ్ 19 వైరస్ కట్టడి కోసం మరి కొన్నాళ్ల పాటు ఆంక్షలను కొనసాగించనున్నట్లు బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. గతంలో తరహాలోనే అన్ని రకాల నియంత్రణ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం, ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. అదే సమయంలో ప్రవాసీయులకు ఆరోగ్య కేంద్రాల్లో విధించే ఏడు బహ్రెయిన్ దినార్ల రాయితీని కూడా మరో రెండు నెలల పాటు కొనసాగించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com