మొబైల్ ఫోన్ పోతే HawkEye appలో ఫిర్యాదు చేయండి-సీపీ అంజనీకుమార్
- January 03, 2021హైదరాబాద్:మొబైల్ ఇప్పుడు మనిషికి నిత్యావసరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. చేతిలో మొబైల్ ఉంటే..ప్రపంచంలోని ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఇక మన వ్యక్తిగత ఫోటోలు, డేటా తదితరాలు అన్నీ ఫోన్లో నిక్షిప్తం చేస్తున్నాం. ఈ క్రమంలో పోయిన మొబైల్ ఫోన్లను..తిరిగి యజమానులకు అప్పగించడం చాలా అవసరమని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే HawkEye లాస్ట్ మొబైల్ ఫోన్లో కంప్లైంట్ చేసిన వాటిని ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఐడెంటిఫై చేసి.. వాటిని రికవరీ చేస్తున్నారు.
తాజాగా 35 కంప్లైంటులకు సంబంధించి రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సీపీ అంజనీకుమార్ యజమానులకు అందించారు. 2015లో ప్రారంభమైన HawkEye యాప్ అప్లికేషన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి దాదాపు 500 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని తిరిగి యజమానులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.మొబైల్ ఫోన్ పోతే.. వెంటనే HawkEyeలో కంప్లైంట్ చేయాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు