సౌరవ్ గంగూలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- January 07, 2021
కోల్కతా:BCCI అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం దాదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. తనకు చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. చికిత్స అనంతరం తాను పూర్తిగా బాగున్నానంటూ గంగూలీ మీడియాకు వెల్లడించారు. కాగా, ఆయన నిన్ననే డిశ్చార్జి కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయనను వైద్యులు డిశ్చార్చి చేయలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. నేటి నుంచి గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఆయన ఇంట్లోనే వైద్యులు పర్యవేక్షించనున్నారు. గంగూలీ కోలుకోవాలంటూ అంతకుముందు రాజకీయ నేతలు, టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులు ట్విట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







