రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత వలసదారుల మృతి
- January 11, 2021
మస్కట్: ఇద్దరు భారత వలసదారులు, సమయిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జబల్ షామ్స్ నుండి వీరంతా మస్కట్కి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ అల్యుమినిగా బాధితుల్ని గుర్తించారు. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఇండియన్ స్కూల్ మస్కట్ సిబ్బంది, బాధితుల సహచరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి తామంతా అండగా వుంటామని ఈ సందర్భంగా ఐఎస్ఎం విద్యార్థులు చెప్పారు. తమ స్నేహితులతో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు వివరించారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని వారు వాపోయారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







