రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత వలసదారుల మృతి
- January 11, 2021
మస్కట్: ఇద్దరు భారత వలసదారులు, సమయిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జబల్ షామ్స్ నుండి వీరంతా మస్కట్కి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ అల్యుమినిగా బాధితుల్ని గుర్తించారు. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఇండియన్ స్కూల్ మస్కట్ సిబ్బంది, బాధితుల సహచరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి తామంతా అండగా వుంటామని ఈ సందర్భంగా ఐఎస్ఎం విద్యార్థులు చెప్పారు. తమ స్నేహితులతో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు వివరించారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని వారు వాపోయారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







