రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత వలసదారుల మృతి
- January 11, 2021
మస్కట్: ఇద్దరు భారత వలసదారులు, సమయిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జబల్ షామ్స్ నుండి వీరంతా మస్కట్కి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ అల్యుమినిగా బాధితుల్ని గుర్తించారు. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఇండియన్ స్కూల్ మస్కట్ సిబ్బంది, బాధితుల సహచరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి తామంతా అండగా వుంటామని ఈ సందర్భంగా ఐఎస్ఎం విద్యార్థులు చెప్పారు. తమ స్నేహితులతో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు వివరించారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని వారు వాపోయారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష