ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో భేటీ అయిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

- January 12, 2021 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో భేటీ అయిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

విజయవాడ: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ విజయవాడ రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ తో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్ భవన్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మెమోంటో, శాలువాతో సత్కరించారు. బండారు దత్తాత్రేయ సాంప్రదాయ హిమాచలి టోపీ. శాలువను ఎపి గవర్నర్ హరిచందన్‌కు అందజేశారు. ఇరు రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com