త్వరలో వ్యాక్సిన్‌ ఎగుమతులు: జైశంకర్‌

- January 12, 2021 , by Maagulf
త్వరలో వ్యాక్సిన్‌ ఎగుమతులు: జైశంకర్‌

న్యూఢిల్లీ : మరికొన్ని వారాల్లో భారత్‌ నుండి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయవచ్చని విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్‌ ఎగుమతులపై కేంద్రానికి స్పష్టత ఉందని అన్నారు. తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించాలన్న ఇతర దేశాల ఆందోళనను భారత్‌ అర్థంచేసుకుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతమేర వ్యాక్సిన్‌లను వినియోగించాలనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అనంతరం ఎగుమతులు ఉంటాయని, ప్రపంచంలోనే వ్యాక్సిన్‌ ఉత్పత్తులలో కీలకమైనదిగా భారత్‌ చేరుకుంటుందని జైశంకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com