భారత్ లో కరోనా కేసుల వివరాలు...

- January 15, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు...

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 15,590 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 191 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోగా.. 15,975 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,27,683కు చేరుకోగా... ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,62,738 మంది కోలుకున్నారు.. ఇక, కరోనాతో 1,51,918 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,13,027 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ. కాగా, ఓ దశలో దాదాపు లక్ష వరకు చేరిన రోజువారీ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి... 12 వేల వరకు వచ్చాయి.. కానీ, మళ్లీ అప్పుడప్పుడు పెరుగుతూ.. కరోనా మీటర్‌ పైకి కదులుతూనే ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com