కోవిడ్ ఎఫెక్ట్...అబుధాబిలో ఎంట్రీకి కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- January 17, 2021అబుధాబి:ఇతర దేశాలతో పాటు దేశీయంగా కూడా అబుధాబిలోకి ఎంట్రీ అయ్యే ప్రయాణికుల కోసం కోత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది అబుధాబి క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆదివారం(జనవరి 17) నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఎవరైనా అబుధాబికి ప్రయాణించాలంటే...ప్రయాణానికి ముందు 48 గంటల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అబుధాబి అధికారులకు పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ లేదా డీపీఐ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా చూపించాలి. అయితే..గతంలో ఈ గడువు 72 గంటలుగా ఉండేది. కానీ, అబుధాబి అధికారులు గడువును 48 గంటలకు కుదించారు. అలాగే అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు...నాలుగో రోజున ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఒకవేళ 8 రోజులు ఉంటే...ఎనిమిదవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించింది. అబుధాబిలోకి అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిబంధనలు యూఏఈలోని అన్ని ప్రాంతాల పౌరులు, ప్రవాసీయులకు వర్తిస్తుంది. అలాగే అబుధాబిలో ఉండే వారు ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చినా..నిబంధనల నుంచి మినహాయింపు ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని అధికారులు సూచించారు. అయితే..వాక్సినేషన్ లో పాల్గొన్నవారు..వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లకు మాత్రం ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..