రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా రాఫెల్ యుద్ధ విమానం
- January 19, 2021భారత వాయుసేన అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం అనదగ్గ రాఫెల్ జెట్ ఫైటర్ ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫ్రాన్స్ కు చెందిన ఈ అధునాతన యుద్ధ విమానాలు ఇటీవలే భారత్ కు చేరాయి. వీటిలో ఒకదాన్ని జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాఫెల్ జెట్ విమానం 'వెర్టికల్ చార్లీ' విన్యాసాలు నిర్వహించనుందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా ముందుకు పయనించే విమానాలు... అందుకు భిన్నంగా నిట్టనిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లడాన్నే 'వెర్టికల్ చార్లీ' విన్యాసం అంటారు. ఈ క్రమంలో విమానం మెలికలు తిరుగుతూ అగ్నికీలలను వెదజల్లుతుంది. వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది మాట్లాడుతూ, వెర్టికల్ చార్లీ విన్యాసాల్లో ఒక రాఫెల్ విమానం పాల్గొంటుందని వెల్లడించారు. ఓవరాల్ గా 38 భారత వాయుసేన విమానాలు గణతంత్ర వేడుకల్లో గగన విహారం చేస్తాయని వివరించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!