అబుధాబి: అసియా కమ్యూనిటీని కించపరిచిన నలుగురు అరబ్బుల అరెస్ట్
- January 22, 2021ఆసియాకు చెందిన ఓ కమ్యూనిటీ కించపరుస్తూ వారిని ఎగతాళి చేసిన కేసులో నలుగరు అరబ్బులను అరెస్ట్ చేయాలని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యుఎఇ అటార్నీ జనరల్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రైమ్స్ నలుగురు నిందితులను విచారించి, వారి ప్రీట్రియల్ డిటెన్షన్ పెండింగ్ దర్యాప్తుకు ఆదేశించింది. నిందితులు నలుగురు అసియాకు చెందిన ఓ కమ్యూనిటీ ఎగతాళి చేస్తూ ప్రవర్తించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. యూఏఈ సహనశీలత, నైతిక విలువలకు ఇది పూర్తిగా వ్యతిరేకమని ఆగ్రహించిన అధికారులు వీడియో ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..