మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్న అష్గల్
- January 23, 2021దోహా:పబ్లిక్ వర్క్స్ అథారిటీ, ఈ ఏడాది మరిన్ని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనుంది. అయిన్ ఖాలిద్, అల్ సాద్ మరియు అల్ ఖోర్లలోని హెల్త్ సెంటర్లను పూర్తి చేయనున్నట్లు అష్గల్ ప్రకటించింది. ఈ కొత్త హెల్త్ సెంటర్లలో జనరల్ మరియు స్పెషల్ క్లినిక్లు, డెంటిస్ట్రీ, ఫిజియోథెరపీ మరియు ఫ్యామిలీ విభాగాలుంటాయి. ఈ మూడు సెంటర్లు 2021 తొలి క్వార్టర్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అష్గల్ పేర్కొంది. కాగా, సౌత్ అల్ వక్రకా హెల్త్ సెంటర్, 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించనుంది. తొమ్మిది క్లినిక్లతో ఇది రూపు దిద్దుకుంటోంది. 125 కార్లకు పార్కింగ్, అంబులెన్సుల గ్యారేజీని ఏర్పాటు చేశారు. అల్ సాద్ హెల్త్ సెంటర్ 29,022 చదరపు మీటర్లలో 100 క్లనిక్స్తో ఏర్పాటవుతోంది. అల్ ఖోర్ సెంటర్ని 24,998 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేస్తున్నారు. 60 క్లినిక్లు రోజుకి 650 మంది విజిటర్స్ కోసం వీలుగా ఏర్పాటు చేయబడుతున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..