ఒమన్ లో ఇప్పటివరకు 27 వేల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- January 24, 2021మస్కట్:ఒమన్ లో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కింగ్డమ్ పరిధిలో పౌరులు, ప్రవాసీయులు అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని మరోసారి తెలిపింది. కోవిడ్ 19 వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇమ్యూనిటీని పెంచేందుకు వ్యాక్సిన్ దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారుల అన్నారు.. కోవిడ్ 19పై ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ 99 శాతం ప్రభావశీలతతో ఫలితాన్నిస్తున్న విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గతేడాది డిసెంబర్ 28న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టగా...ఇప్పటివరకు 27 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఒమన్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..