తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన PRC నివేదిక విడుదల
- January 27, 2021హైదరాబాద్:తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదలైంది. తొలుత ఉద్యోగ సంఘాలకే నివేదిక ఇవ్వాలని భావించినా.. ఆయా సంఘాల నేతల వినతితో 275 పేజీల నివేదికను వెబ్ సైట్ లో ప్రభుత్వం పెట్టింది. 7.5శాతం ఫిట్మెంట్ను బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కూడా రికమెండ్ చేసింది. ఇటు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు త్రిసభ్యకమిటీ ఆహ్వానం పంపింది. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్ లోని బీఆర్కే భవన్లో చర్చలు జరుగుతాయి. రెండు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొంటారు. గురువారం నుంచి రెండు లేదా నాలుగు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలను పురస్కరించుకొని త్రిసభ్య కమిటీ విడిగా సమావేశం కానుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?