గంగూలీ క్షేమం
- January 28, 2021
కలకత్తా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు గురువారం సాయంత్రం తెలిపారు. ఈరోజు పరీక్షలు కూడా నిర్వహించామని, ఫలితాలు వచ్చాక తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి సీనియర్ వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో బుధవారం ఆయన రెండోసారి ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. యాంజియోగ్రాఫీ చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి మరో స్టెంట్ను వేస్తారని కూడా సమాచారం.
జనవరి తొలివారంలో ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు గుండె రక్తనాళాల్లో మూడుచోట్ల పూడికలుడడంతో సమస్య కనిపించిన చోట వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం బాగానే ఉండడంతో మిగిలిన చోట్ల స్టెంట్ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే.. బుధవారం కాస్త తేడాగా అనిపించడంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు. గురువారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాట్లాడుతూ.. దాదా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని, ఉదయం లేవగానే తేలికపాటి అల్పాహారం తీసుకున్నారన్నారు. వెస్ట్బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే గంగూలీ ఆరోగ్యం పట్ల ఆరా తీశారని, సిపిఎం సీనియర్ నాయకులు అశోక్ భట్టాచార్య ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!