గంగూలీ క్షేమం

- January 28, 2021 , by Maagulf
గంగూలీ క్షేమం

కలకత్తా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు గురువారం సాయంత్రం తెలిపారు. ఈరోజు పరీక్షలు కూడా నిర్వహించామని, ఫలితాలు వచ్చాక తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో బుధవారం ఆయన రెండోసారి ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. యాంజియోగ్రాఫీ చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి మరో స్టెంట్‌ను వేస్తారని కూడా సమాచారం.

జనవరి తొలివారంలో ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు గుండె రక్తనాళాల్లో మూడుచోట్ల పూడికలుడడంతో సమస్య కనిపించిన చోట వైద్యులు స్టెంట్‌ అమర్చారు. ఆరోగ్యం బాగానే ఉండడంతో మిగిలిన చోట్ల స్టెంట్‌ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే.. బుధవారం కాస్త తేడాగా అనిపించడంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు. గురువారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాట్లాడుతూ.. దాదా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని, ఉదయం లేవగానే తేలికపాటి అల్పాహారం తీసుకున్నారన్నారు. వెస్ట్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే గంగూలీ ఆరోగ్యం పట్ల ఆరా తీశారని, సిపిఎం సీనియర్‌ నాయకులు అశోక్‌ భట్టాచార్య ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com