జజీరా ఎయిర్ లైన్స్:కువైట్-ఇండియా ఫ్లైట్ టికెట్ ఆఫర్...
- January 29, 2021కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇండియాలోని నాలుగు నగరాలకు ప్రయాణించే ప్రయాణికులకు జజీరా ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించింది. సగటున 15 వేల రూపాయలతో ఇండియాలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కొచ్చి ప్రయాణించేలా టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది.
భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా జజీరా టికెట్ ఆఫర్లను ప్రకటించింది. ఖాట్మండు, ఢాకా, లాహోర్, దోహా, దుబాయ్, మస్కట్, అమ్మన్, దమ్మమ్, ఇస్తాంబుల్, జెడ్డా, రియాద్ ప్రయాణాలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే..ప్రయాణికులు బయల్దేరే ముందు కువైట్ ఆరోగ్య శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే గమ్యస్థాన దేశాలు ప్రకటించిన నిబంధనల పట్ల కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని జజీరా ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..