యూఏఈ APNRTS రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రసన్న సోమిరెడ్డి

- January 29, 2021 , by Maagulf
యూఏఈ APNRTS రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రసన్న సోమిరెడ్డి

యూఏఈ:ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS)యూఏఈ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రసన్న సోమిరెడ్డి నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్‌ జగన్‌ మరియు వెంకట్  మేడపాటి(APNRTS ప్రెసిడెంట్),ఇలియాస్(APNRTS డైరెక్టర్)కు కృతజ్ఞతలు తెలిపారు.APNRTS యొక్క ఉపయోగాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్‌ ఇండస్ట్రీ  పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలను యూఏఈలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సోమిరెడ్డి మాగల్ఫ్ న్యూస్ కి తెలిపారు.

 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com