ట్రావెల్ బ్యాన్ ను మే 17 వరకు పొడిగించిన సౌదీ అరేబియా
- January 30, 2021
రియాద్:రోడ్డు మార్గాలు, జల సరిహద్దులు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై సౌదీ అరేబియా ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 17 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే..జనవరిలో చేసిన ప్రకటన మేరకు మార్చి 31తో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ముగియాల్సి ఉంది. కానీ, ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్ విస్తరిస్తుండటం, వైరయస్ వేరియంట్స్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్యావెల్ బ్యాన్ ను పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల్లో ఇమ్యూనిటీ స్థాయిలను పెంచటమే తమ ప్రధమ లక్ష్యమని ఆ తర్వాతే ప్రయాణాలపై ఆలోచిస్తామని పేర్కొంది. పరిస్థితులు అనుకూలిస్తే మే 17 అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఎయిర్ పోర్టుల, సీ పోర్టులతో పాటు భూ సరిహద్దు రహదారులు పూర్తిగా తెరుస్తామని వెల్లడించింది. ఇదిలాఉంటే...కింగ్డమ్ పరిధిలో గత 24 గంటల్లో 267 కొత్త కేసులు నమోదయ్యాయి. 253 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. అయితే..కింగ్డమ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కు డోసుల దిగుమతిలో జరుగుతున్న ఆలస్యం ఇబ్బందిగా మారుతోంది. తర్వాతి దశ బ్యాచ్ దిగుమతి ముందనుకున్న గడువు కన్నా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!