అవసరమైతేనే హెల్త్ సెంటర్లకు వెల్ళాలి: బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ

- February 03, 2021 , by Maagulf
అవసరమైతేనే హెల్త్ సెంటర్లకు వెల్ళాలి: బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ

మనామా:హెల్త్ మినిస్ట్రీ, తమ పౌరులు అలాగే రెసిడెంట్స్ ప్రభుత్వ హెల్త్ సెంటర్లకు అవసరమైతే తప్ప వెళ్ళడం తగ్గించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, హెల్త్ సెంటర్లకు వెళ్ళడం మానాలన్నది బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ తాజా సూచన.ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ విధానం ద్వారా అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. హాట్‌లైన్ ద్వారా కూడా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.హెల్త్ సెంటర్లను విజిట్ చేసే క్రమంలో చిన్న పిల్లల్ని తమ వెంట తీసుకెళ్ళకూడదు. మైనర్ ఆపరేషన్స్ అలాగే మహిళలకు రెగ్యులర్ చెకప్‌లు వంటివాటిని తాత్కాలికంగా రీ-షెడ్యూల్ చేయడం జరిగింది. రిమోట్ కౌన్సిలింగ్ సర్వీస్‌ని వినియోగించుకోవాల్సిందిగా రోగులకు సూచిస్తున్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com