దుబాయ్ లోని గురుద్వారాలో కరోనా వ్యాక్సిన్

- February 09, 2021 , by Maagulf
దుబాయ్ లోని గురుద్వారాలో కరోనా వ్యాక్సిన్

దుబాయ్: సాధారణంగా దుబాయ్ సిఖ్ టెంపుల్ వద్ద పెద్దయెత్తున ప్రత్యేక ప్రార్థనల కోసం జనం గుమికూడేవారు. కొందరు, సిక్కు సమాజం అందించే ఆహార పదార్థాల కోసం ఎదురుచూసేవారు. అలా ప్రజల సేవలో తరించిన సిక్కు సమాజం, కరోనా నేపథ్యంలో కొత్త సేవా మార్గాన్ని ఎంచుకుంది. 5 వేల మందికి సినోఫామ్ కరోనా వ్యాక్సిన్‌ని అందించే కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వచ్చేవారితో సిఖ్ టెంపుల్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి విషయాల్లో స్థానిక సిక్కులు వచ్చేవారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, యూఏఈలో ఇప్పటిదాకా 4.4 మిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసుల్ని అందించడం జరిగింది. 16 ఏళ్ళ పైబడిన వయసున్నవారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com