ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 14, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,788 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 55 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు.  ఇదే సమయంలో 117 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,85,974కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,78,077 కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,162 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 735 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com