సౌదీ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న మహిళల సంఖ్య
- February 17, 2021
సౌదీ: మహిళా స్వాలంభన దిశగా సౌదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దేశ న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. జ్యూడిషియల్ సెక్టార్ లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య గతేడాదిలో 1,814 మందికి పెరిగింది. ఇక లాయర్లుగా లైసెన్స్ పొందిన మహిళల సంఖ్య 2019లో 618గా ఉంటే... 2020లో 1,029కి పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 66 శాతం పెరిగిందని న్యాయ మంత్రిత్వ శాఖలోని మహిళా విభాగం డైరెక్టరేట్ కార్యాలయం వివరించింది. జ్యూడిషియల్ సెక్టార్లోని లీగల్, సోషల్ రీసెర్చర్స్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్స్, ప్రోగ్రామ్ డెవలపర్స్ ఇలా పలు విభాగాల్లో 2020 నాటికి 30,500 మంది సేవలు అందిస్తున్నారని వివరించింది. వుమెన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం వల్లే మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు దోహదపడిందని, ఇటీవలె న్యాయ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని పేర్కొంది. లాయర్లుగా లైసెన్స్ పొందెందుకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని..ప్రస్తుతం 4,070 మంది ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతుండగా..అందులో 1,680 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. విజన్ 2030 లక్ష్యం మేరకు దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యిన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫీస్ వివరించింది.
తాజా వార్తలు
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు







