సౌదీ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న మహిళల సంఖ్య
- February 17, 2021
సౌదీ: మహిళా స్వాలంభన దిశగా సౌదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దేశ న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. జ్యూడిషియల్ సెక్టార్ లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య గతేడాదిలో 1,814 మందికి పెరిగింది. ఇక లాయర్లుగా లైసెన్స్ పొందిన మహిళల సంఖ్య 2019లో 618గా ఉంటే... 2020లో 1,029కి పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 66 శాతం పెరిగిందని న్యాయ మంత్రిత్వ శాఖలోని మహిళా విభాగం డైరెక్టరేట్ కార్యాలయం వివరించింది. జ్యూడిషియల్ సెక్టార్లోని లీగల్, సోషల్ రీసెర్చర్స్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్స్, ప్రోగ్రామ్ డెవలపర్స్ ఇలా పలు విభాగాల్లో 2020 నాటికి 30,500 మంది సేవలు అందిస్తున్నారని వివరించింది. వుమెన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం వల్లే మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు దోహదపడిందని, ఇటీవలె న్యాయ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని పేర్కొంది. లాయర్లుగా లైసెన్స్ పొందెందుకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని..ప్రస్తుతం 4,070 మంది ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతుండగా..అందులో 1,680 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. విజన్ 2030 లక్ష్యం మేరకు దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యిన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫీస్ వివరించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







