హోటళ్లకు ఉత్తర్వులు
- February 24, 2021
షార్జా: పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేక్రమంలో యూఏఈ ప్రభుత్వం ఎంతో క్రియాశీలముగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో హోటళ్లు నడిపేవారికి ఉత్తర్వులు జారీ చేసింది షార్జా. షార్జాలోని హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి రెండు వారాలకు తప్పనిసరిగా పిసిఆర్ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, వ్యాక్సిన్లు రెండు డోసులు పూర్తిచేసినవారికి ఈ నియమాన్ని మినహాయించారు.
హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్లను తీసుకున్నట్టు/నెగటివ్ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని కలిగిఉన్నట్టు ధృవీకరిస్తూ స్టిక్కర్లను సంబంధిత హోటళ్లు అందరికి కనపడేట్టు ఉంచాలి. మెనూ కార్డులను కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి; ఒక టేబుల్ కు నలుగురు మాత్రమే ఉండేట్టు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని షార్జా మున్సిపాలిటీ తెలిపింది.
హోటళ్లు ఈ నియమాలను పాటిస్తున్నదీ లేనిది పర్యవేక్షించేందుకు షార్జా మునిసిపాలిటీ తనిఖీలను ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







