హోటళ్లకు ఉత్తర్వులు
- February 24, 2021
షార్జా: పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేక్రమంలో యూఏఈ ప్రభుత్వం ఎంతో క్రియాశీలముగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో హోటళ్లు నడిపేవారికి ఉత్తర్వులు జారీ చేసింది షార్జా. షార్జాలోని హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి రెండు వారాలకు తప్పనిసరిగా పిసిఆర్ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, వ్యాక్సిన్లు రెండు డోసులు పూర్తిచేసినవారికి ఈ నియమాన్ని మినహాయించారు.
హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్లను తీసుకున్నట్టు/నెగటివ్ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని కలిగిఉన్నట్టు ధృవీకరిస్తూ స్టిక్కర్లను సంబంధిత హోటళ్లు అందరికి కనపడేట్టు ఉంచాలి. మెనూ కార్డులను కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి; ఒక టేబుల్ కు నలుగురు మాత్రమే ఉండేట్టు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని షార్జా మున్సిపాలిటీ తెలిపింది.
హోటళ్లు ఈ నియమాలను పాటిస్తున్నదీ లేనిది పర్యవేక్షించేందుకు షార్జా మునిసిపాలిటీ తనిఖీలను ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







