తల్లితండ్రులను గౌరవించి నప్పుడే మన సంస్కృతిని గౌరవించినట్లు:అలనాటి నటీమణి జమున
- February 28, 2021
'మన తన తల్లిదండ్రులను గౌరవించడం కూడా మన సంస్కృతి' అన్న విషయం గుర్తుంచుకో గుర్తుంచుకోవాలనీ, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించి వారిని వృద్ధాశ్రమాల పాలు చేయకూడదని స్వర్ణయుగ ప్రజా నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు, కళాభారతి జమునా రమణ రావు అంతర్జాలంలో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, అమెరికా వారు నిర్వహించిన సేవా శిరోమణి సుభద్ర మూర్తి 83 వ జయంతి సభలో పాల్గొని మాట్లాడుతూ తమ సందేశాన్ని ఇచ్చారు.

అమెరికాలో ఉంటున్న సుభద్ర మూర్తి కుమార్తె ఆమె తల్లిదండ్రుల పేరుమీద ఒక పురస్కారాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం బహూకరించడం ఎంతో ప్రశంసనీయమనీ అన్నారు.వంశీ అధ్యక్షులు వంశీ రామరాజు అంతర్జాల సభకు అధ్యక్షత వహిస్తూ సుభద్రామూర్తి రెడ్ క్రాస్ సంస్థ వారధిగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సాంస్కృతిక సంస్థలకు, వృద్ధులకు, దివ్యాంగుల ఆశ్రమాలకు చేయూత నిచ్చిన సేవా శిరోమణి అని ప్రశంసించారు.

అమెరికాలో ఫ్లోరిడాలో ఉంటున్న సురేఖ కిషోర్ జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమైన ఈ అంతర్జాల కార్యక్రమంలో లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు తన వీణ నాదంతో కార్యక్రమానికి శోభను చేకూర్చారు... రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అనఘాదత్త రామరాజు ప్రార్థనా గీతం ఆలపించారు.. అవార్డు స్వీకరించిన రోజా మీన్ ప్రాధాన్ తను చేస్తున్న సేవలకు గుర్తింపుగా సుభద్ర పేరు మీద నెలకొల్పిన అవార్డును స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.. కార్యక్రమ సంధానకర్త, అమెరికా వాస్తవ్యులు భరద్వాజ శ్రీనివాస కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంలో భాను శాస్త్రి (అమెరికా), అనూప్ శాస్త్రి (అమెరికా), ప్రమీలా ఆరబ్, పద్మా ప్రమోద్ ,నిర్మల కొచ్చర్లకోట ,యామిని రమణ, కార్తీక్, మహతీ భరద్వాజ్ తమ గానాన్ని వినిపించారు.. రాగ సప్తస్వర రాజ్యలక్ష్మి సంధ్యారాణి ,సుభద్ర మూర్తి తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.. వంశీ సంస్థ అధ్యక్షురాలుతెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకర పల్లి కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు..
ట్రై నెట్ లైవ్ టీవీ, టీ వీఏసియా తెలుగు, యు ఎస్ వన్ టీవీ, మన టీవీ వారు కార్యక్రమం మొత్తాన్ని అంతర్జాతీయంగా ప్రసారం చేశారు
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







