BREAKING!! వీసాల గడువు పొడిగింపు
- March 01, 2021అబుధాబి: టూరిస్ట్ వీసా గడువు ముగిసిపోవడం ఇబ్బందులకు గరవుతున్న పర్యాటకులకు యూఏఈ తీపి కబురు చెప్పింది. వీసాల గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. గడువు తీరిపోయిన.. నెల, మూడు నెలల విజిట్ వీసాలు, టూరిస్ట్ వీసాల కాలపరిమితిని మార్చి 31 వరకు పొడగిస్తున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెన్ అఫైర్స్ (జీడీఆర్ఎప్ఏ) ప్రకటించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని ట్రావెల్ ఏజెట్లు కూడా స్పష్టం చేశారు. ‘మా క్లైంట్ల దుబాయ్ వీసాల గడువు మార్చి 31 వరకు అక్కడి ప్రభుత్వం పొడగించింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది’ అని పేర్కొన్నారు. కాగా.. నెల రోజులపాటు వీసాల గడువును ఉచితంగా పొడగించనున్నట్టు.. యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిసెంబర్ 27 వెల్లడించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండటం, అక్కడి దేశాలు తిరిగి లాక్డౌన్లను విధిస్తుండటంతో ఇది అమలులోకి వచ్చింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ