సేల్స్ కాల్ వల్ల 12 మిలియన్ దిర్హాములు గెల్చుకున్న భారత వలసదారుడు
- March 04, 2021
యూఏఈ: ఓ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ చేసిన ఫోన్ కాల్, భారతీయ వలసదారుడు శివమూర్తి కృష్ణప్పకి 12 మిలియన్ దిర్హాములు గెలచుకునే అవకాశం కల్పించింది. మెకానికల్ ఇంజనీర్ అయిన కృష్ణప్ప, టిక్కెట్లను కొనుగోలు చేసే క్రమంలో ప్రతిసారీ ఎగ్జిక్యూటివ్లను మార్చుతుంటారు. అయితే, ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ వుందంటూ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేయడంతో, ఆయన ఆలోచన మారింది. ఆ కాల్ అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఫిబ్రవరిలో ఆయన టిక్కెట్ 202511 అనూహ్యంగా బహుమతిని గెలుచుకుంది. 2005లో తాను షార్జాలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించానని, మూడేళ్ళపాటు తాను అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. ప్రతిసారీ 500 దిర్హాములు ఖర్చు చేసి టిక్కెట్ కొనుగోలు చేశానని, అనూహ్యంగా ఈసారి తనకు అదృష్టం కలిసొచ్చిందని వివరించారు. భార్య శ్వేత, కుమార్తె షమిత, కుమారుడు షాన్ పేర్లతో టిక్కెట్లు కొనుగోలు చేసి విజయం సాధించానని అన్నారు. ఇంత సొమ్ము గెలుచుకున్నాక ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాననీ, ముందు ముందు భవిష్యత్తు గురించి తీరిగ్గా ఆలోచిస్తానని అన్నారాయన.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







