భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 21, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో రోజువారీ పాజిటివ్ కేసులు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి.నాలుగు నెలల క్రితం ఏ స్థాయిలో కేసులు నమోదయ్యాయో అదే విధంగా ఇప్పుడు కేసులు నమోదవుతుండటం కొంత భయాన్ని కలిగిస్తోంది.సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ వేరియంట్లు మన దేశంలో పెద్దగా కనిపించలేదని నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.తాజాగా దేశంలో 43,846 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు 1,15,99,130 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,11,30,288 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,09,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో 22,956 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 197 మంది మృతి చెందారు.ఇప్పటి వరకు దేశంలో 1,59,755 మంది కరోనాతో మృతి చెందినట్టు బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..