యెమన్లో శాంతి స్థాపనకు సౌదీ కొత్త ప్రతిపాదనలు
- March 23, 2021
సౌదీ:ఆరేళ్లుగా రావాణకాష్టంలా రగలిపోతున్న యెమెన్లో శాంతి స్థాపనకు సౌదీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. యెమెన్లో ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని కింగ్డమ్ విదేశాంగ మంత్రి ప్రతిపాదించారు. అలాగే వాయు, జల మార్గాలపై నిషేధాన్ని కొన్ని ప్రాంతాల్లో ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందులోభాగంగా సనలోని ఎయిర్ పోర్టు, హోడైడాలోని నౌకాశ్రయం మీదుగా చమురు, అహార దిగుమతులు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. సౌదీ ప్రతిపాదనలను అంతర్జాతీయ సమాజం గుర్తించిన యెమన్ ప్రభుత్వం కూడా స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు, తిరికి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హౌతీ తిరుగుబాటుదారులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. సౌదీ ప్రతిపాదనలకు హౌతిస్ సానుకూలంగా స్పందించిన పక్షంలో కాల్పుల విరమణ, జల, వాయు రవాణాపై నిషేధం ఎత్తివేత అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..