ఉచిత క్వారంటైన్ ప్యాకేజీ...యూఏఈ ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
- March 27, 2021యూఏఈ:హాలిడే ట్రిప్ కోసం ప్లాన్ చేసుకుంటున్న యూఏఈ పౌరులు, నివాసితులకు ఆ దేశ విమానయాన సంస్థలు శుభవార్త తెచ్చాయి.క్వారెంటైన్ నిబంధనలు లేని దేశాలకు వెళ్లేందుకు హాలిడే ప్యాకేజీలను ప్రకటించాయి.వివరాల్లోకి వెళితే..కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన ఆంక్షల మూలంగా చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.ఇదే సమయంలో చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి.ఈ క్రమంలో కొన్ని దేశాలు ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా చేసుకున్నాయి.ఇందులో భాగంగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్తో తమ దేశంలోకి అడుగుపెట్టే విదేశీ పర్యాటకులకు క్వారెంటైన్ నిబంధనలు వర్తింప చేయమని ప్రకటించాయి.
ఈ జాబితాలో టిబిలిసి, కైవ్,ఇస్తాంబుల్, తాష్కెంట్ సీషెల్స్,మాల్దీవులు,యెరెవాన్ మరియు నైరోబి కూడా ఉన్నాయి.ఈ క్రమంలో యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు.. ఆయా దేశాలకు హాలిడే ప్యాకేజీలను రూపొందించాయి.ఈ ప్యాకేజీలు 1,029 దిర్హామ్ల నుంచి మొదలుకొని అత్యధికంగా 3,449 దిర్హామ్ల వరకూ ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఎయిర్ అరేబియా, ఇతిహాద్ ఎయిర్వేస్ వంటి సంస్థలు ఈ హాలిడే ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. కాగా.. మార్చి 31 వరకు మాత్రమే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని ఇతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది.ఈ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకోవాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..