ఎయిమ్స్కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తరలింపు..
- March 27, 2021
న్యూ ఢిల్లీ:భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వల్ప అనారోగ్యానికి గురై శుక్రవారం రోజు ఆస్పత్రిలో చేరారు.. అయితే, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు ఆర్మీ హాస్పిటల్ వైద్యులు.. ప్రస్తుతం రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న ఆర్మీ హాస్పిటల్ వైద్యులు.. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్కు సిఫారసు చేసినట్లు కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు.. కాగా, శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురైన రాష్ట్రపతి కోవింద్.. ఢిల్లీలోని ఆర్అండ్ఆర్ హాస్పిటల్లో చేరారు.. ఆయనకు సాధారణ పరీక్షలు చేసి పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు.. ఇక, ఆస్పత్రిలో ఉన్న రాష్ట్రపతిని కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, రాజ్నాథ్ సింగ్ పరామర్శించగా.. రాష్ట్రపతి కుమారుడి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు.. రామ్నాత్ కోవింద్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు వైద్యులు.. మరిన్ని పరీక్షలు, పర్యవేక్షణ తర్వాత ఈ నెల 30న ఆయనకు బైపాస్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్రపతి కార్యాలయం కూడా ప్రకటించింది.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







