తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు.. మాస్క్ తప్పనిసరి
- March 28, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్-ఎ- బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్లు వరుసగా వస్తున్నాయి. దీంతో ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం-2005, సంబంధిత చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్క్లు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపిసిలోని సెక్షన్ 188 కింద చర్యలు ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!









