తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు.. మాస్క్ తప్పనిసరి
- March 28, 2021హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్-ఎ- బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్లు వరుసగా వస్తున్నాయి. దీంతో ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం-2005, సంబంధిత చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్క్లు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపిసిలోని సెక్షన్ 188 కింద చర్యలు ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!