ఏప్రిల్ 22 వరకు కర్ఫ్యూ పొడగింపు
- April 02, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాధి నియంత్రణకు కర్ఫ్యూను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. మరో రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ 22 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే రోజు వారి పాక్షిక కర్ఫ్యూ సమయాన్ని పది గంటలకు కుదించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పవిత్ర రమదాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీసులకు సడలింపు ఇచ్చారు. రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు రెస్టారెంట్లు, కేఫ్లు, కేటరింగ్ సర్వీసులు ఆన్లైన్ డెలివరీ కొనసాగించవచ్చు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు అవుట్డోర్ ఎక్సర్సైజ్కి అనుమతి ఉంటుంది. పండగ దృష్ట్యా రాత్రి 7 నుంచి మధ్య రాత్రి వరకు షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఫ్రీ బుకింగ్ తర్వాతనే షాపింగ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







