కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
- April 20, 2021
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఇందులో కోవిడ్-19 పాజిటివ్గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. రాహుల్ గాంధీతో సహా అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. నిన్న కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చికిత్స కోసం ఎయిమ్స్లో చేరారు.అంతకుముందు వ్యాక్సినేషన్ మూడో విడతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విధానంలో బలహీన వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందనే భరోసా లేదని ఆయన ఆరోపించారు. ఇది వివక్షాపూరితమైన విధానమని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







