కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
- April 20, 2021న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్ని స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. ఇందులో కోవిడ్-19 పాజిటివ్గా తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. రాహుల్ గాంధీతో సహా అనేక మంది నేతలు కరోనా బారిన పడ్డారు. నిన్న కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ చికిత్స కోసం ఎయిమ్స్లో చేరారు.అంతకుముందు వ్యాక్సినేషన్ మూడో విడతపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.ఈ విధానంలో బలహీన వర్గాల వారికి వ్యాక్సిన్ అందుతుందనే భరోసా లేదని ఆయన ఆరోపించారు. ఇది వివక్షాపూరితమైన విధానమని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం