‘ఎక్స్ఛేంజీ హౌస్’కి 496,000 దిర్హాముల జరీమానా
- April 22, 2021
యూఏఈ: యాంటీ మనీ లాండరింగ్ - ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మరియు ఇల్లీగల్ ఆపరేషన్స్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఓ మనీ ఎక్స్ఛేంజ్ సంస్థకు భారీగా జరీమానా విధించింది యూఏఈ సెంట్రల్ బ్యాంక్. మొత్తం 496,000 దిర్హాముల జరీమానా సదరు సంస్థ ఎదుర్కోనుంది. సదరు సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించిన దరిమిలా జరీమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 18న ఈ జరీమానా విధించారు. అయితే, ఆ సంస్థ పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఎక్స్ఛేంజ్ కార్యాలయాలపై ఎప్పటికప్పుడు నిఘా వుంటుందనీ, అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు కఠినంగా వుంటాయని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి. సెంట్రల్ బ్యాంక్ గతంలో రెండు సార్లు పలు సంస్థలకు ఇలాగే జరీమానాలు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









