ఏప్రిల్ 27 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

- April 25, 2021 , by Maagulf
ఏప్రిల్ 27 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు విలువైన విద్యను కోల్పోతున్నారు.ఇంటికే పరిమితమయ్యి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె,తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 27 వ తేదీ నుంచి మే 31 వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.జూన్ 1 వ తేదీన  అప్పటి పరిస్థితులను బట్టి ఎప్పుడు స్కూల్స్ తెరిచేది ప్రకటిస్తామని తెలంగాణ విద్యాశాఖ పేర్కొన్నది.  ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com