భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.సెకండ్ వేవ్లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ కోవిడ్ కేసులు పైపైకి కదులుతూనే ఉన్నాయి.ఇవాళ ఏకంగా 4 లక్షల మార్క్ను కూడా క్రాస్ చేసింది కరోనా రోజువారి కేసుల కౌంట్.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3523 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,99,988 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం శుభపరిణామంగా చెప్పుకోవాలి.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,64,969కు చేరుకోగా.. రికవరీ కేసులు 1,56,84,406 కి పెరిగాయి.ఇక ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 2,11,853 మంది మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 32,68,710గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు.. ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు ప్రకటించింది.ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,45,299 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 28,83,37,385కి చేరినట్టు ICMR వెల్లడించింది
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







