మనోజ్ కుమార్ ను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు ..!!
- March 04, 2016
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయా కీ గోద్ మే, రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి వంటి సినిమాలతో మనోజ్ కుమార్ ఎంతో గుర్తింపును తెచ్చుకున్నారు. తన సినిమాల్లో మనోజ్ దేశభక్తిని ఎక్కువగా చూపించేవారు. దేశభక్తి సినిమాల విషయాన్ని తాము ఆయన నుంచే తాము నేర్చుకున్నామని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఆయనకు అభినందనలు చెప్పారు.2015 సంవత్సరానికి గాను 47వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మనోజ్కుమార్ను ఎంపిక చేసినట్లు ఎంఐబీ ఇండియా ఓ ట్వీట్ లో తెలిపింది.
సినీ పరిశ్రమ అభివృద్ధికి అద్భుతకృషి చేసినందుకు, ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నందుకు భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు ఈ సారి మనోజ్ కుమార్ ఎంపికయ్యారు. ఉపకార్ సినిమాకి నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్న ఆయన.. 1992 లో భారత ప్రభుత్వం అందిచే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా పొందారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









