తెలంగాణ ప్రభుత్వ సర్క్యులర్ పై హైకోర్టు స్టే
- May 14, 2021
హైదరాబాద్: ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.అలా అంబులెన్సులను ఆపే హక్కు ఎవరిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు మండిపడింది.రాష్ట్ర సరిహద్దుల్లో ఆంబులెన్స్ లో నిలిపివేస్తున్నారంటూ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థాన విచారణ చేపట్టింది. వాహనాలను ఆపి ఆర్టికల్ 21 ను ఉల్లంఘిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది.పేషంట్ లతో వెళ్తున్న అంబులెన్సులను ఆపడం ఎక్కడైనా చూశామా అని హైకోర్టు ప్రశ్నించింది.అటు ఈ నెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు వెల్లడించింది.తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |









