దుబాయ్ టిఓఐఎఫ్ఎలో షారుక్, సల్మాన్ సందడి
- March 04, 2016
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిలిం అవార్డ్స్ సెకెండ్ ఎడిషన్ మార్చ్ 18న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో జరగనుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఈవెంట్లో షారుక్ఖాన్, సల్మాన్ఖాన్, వరుణ్ ధవన్, కరీనాకపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, యోయో హనీ సింగ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు డాన్స్, సింగింగ్ ప్రదర్శనలతో సందడి చేయనున్నారు. స్పెషల్ ప్యానెల్ మరియు, పబ్లిక్ పాపులర్ ఛాయిస్ ద్వారా అవార్డు విజేతల్ని ప్రకటిస్తారు ఈ వేదికపైన. వరుణ్ ధవన్ మాట్లాడుతూ, టిఓఐఎఫ్ తనకు తొలిసారిగా అవకాశం కల్పించిన వేదిక అనీ, బెస్ట్ డిబటెంట్ యాక్టర్ కేటగిరీలో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకి అవకాశం దక్కిందని చెప్పాడు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తామని ఆహూతులకు ఈ సందర్భంగా వరుణ్ భరోసా ఇచ్చాడు. టిఓఐఎఫ్ సెకెండ్ ఎడిషన్లో తానూ భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పంది బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్. ఇండియా, బహ్రెయన్, కెఎస్ఏ, ఖతార్ ఒమన్ మరియు యూకేకి చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో దుబాయ్కి ఈ కార్యక్రమం కోసం రానున్నారు. తొలి ఎడిషన్ టిఓఐఎఫ్ఎ వాంకోవర్, బ్రిటిష్ కొలంబియా, కెనడాల్లో 40,000 మంది ఆడియన్స్ సమక్షంలో నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఇవెంట్ ఆర్గనైసర్ గా ఇవెంట్జ్ అన్లిమిటెడ్ వారు వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









